ఈసారి కాస్త ముందుగానే ‘నైరుతి’ రుతుపవనాలు

-

గతేడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చి రైతులకు తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈనెల 19వ తేదీ కల్లా దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈరోజు వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news