అవినాశ్ రెడ్డికి షాక్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

-

వై ఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు వివేకా కూతురు సునీత. ఈ నేపథ్యంలోనే సునీత పిటీషన్‌ ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ రోజు సిజెఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా.
రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పారు సిజెఐ డివై చంద్రచూడ్.

YS Viveka’s daughter, YS Sunitha

దీంతో ఈ పిటీషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది.25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. అయితే.. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసింది సునీత. దీంతో అవినాష్ రెడ్డి షాక్‌ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news