విజయసాయి నో పాలిటిక్స్..బాబుకు కలిసొచ్చేలా!

-

ఏపీ రాజకీయాల్లో టి‌డి‌పి అధినేత చంద్రబాబుని దారుణంగా తిట్టే నేతల్లో కొడాలి నాని ఒకరు కాగా, మరొకరు విజయసాయిరెడ్డి అనే చెప్పాలి. మీడియా ముందుకొచ్చి కొడాలి..బాబుని బూతులు తిట్టేవారు. ఇక సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి…తనదైన శైలిలో బాబుపై ఫైర్ అయ్యేవారు. అసలు ఏ స్థాయిలో ఆయన్ని తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు.

అలా బాబుని తిట్టే నాయకుడు ఇప్పుడు మారిపోయారు..ఊహించని మార్పు వచ్చింది. తారకరత్న చనిపోయిన దగ్గర నుంచి సాయిరెడ్డి రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు. తారకరత్నకు అటు చంద్రబాబు, ఇటు సాయిరెడ్డి సైతం బంధువులే. ఇక ఆయన మరణించిన రోజు…ఇద్దరు నేతలు కలిశారు..పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. అంత్యక్రియలు అయ్యే వరకు కలిసే ముందుకెళ్లారు. అలా ఇద్దరు కలవడంతో రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు.  అసలు సాయిరెడ్డి ఏ మాత్రం సోషల్ మీడియాలో రాజకీయ పరమైన పోస్టులు పెట్టడం లేదు. పైగా వైసీపీలో ఆయనని పక్కన పెట్టేసినట్లు కనిపిస్తున్నారు. దీంతో పార్టీ పరంగా కూడా ఆయన యాక్టివ్‌గా ఉండటం లేదు.

ఇక భారతదేశం ప్రజస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థల గురించి ఆయన పోస్టులు పెడుతున్నారు. దీని బట్టి చూస్తే సాయిరెడ్డిలో ఎంత మార్పు వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆయన..బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

సాయిరెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ పెద్ద ఎత్తున ట్వీట్స్ వస్తున్నాయి. మీ నుంచి ఇది ఊహించలేదంటూ కొందరు.. మీరు ఇలాగే ఉండండి సార్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సాయిరెడ్డిలో మార్పు రాజకీయంగా చంద్రబాబుకు కలిసొచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news