BREAKING : తారకరత్నకు మరోసారి యాంజియోప్లాస్టీ

-

నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆయనకు మరోసారి యాంజియోప్లాస్టి చేశారు.

డా.ఉదయ్ సారథ్యంలోని వైద్యుల బృందం అనుక్షణం పర్యవేక్షిస్తోంది. మరోవైపు కాసేపట్లో టిడిపి అధినేత చంద్రబాబు బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించనున్నారు. నందమూరి బాలకృష్ణ రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు.

అటు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news