BREAKING : ఇవాళ అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ..పొత్తు కుదిరేనా !

-

ఇవాళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీకి పయనం అయ్యారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై అమిత్‌ షాతో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కలిసి ఎన్నికల్లో పోటీచేసే ప్రతిపాదనలపై ఇరువురి మధ్య చర్చలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరించనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news