BREAKING: 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చేసిన టీడీపీ !

-

5 స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది టీడీపీ పార్టీ. ఈ మేరకు పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది టీడీపీ. కొన్ని స్థానాల్లో అభ్యర్థిత్వాల్లో మార్పులు చేర్పులు చేయనుంది టీడీపీ అధిష్టానం. ఐదు స్థానాల్లో అభ్యర్థులలో మార్పులు చేసింది.

Chandrababu will give B-Forms to the candidates today

ఉండి నుంచి రామరాజు ఔట్… మాడుగుల టిక్కెట్ దక్కించుకున్నారు బండారు. పాడేరు టిక్కెట్ గిడ్డి ఈశ్వరికి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. మడకశిర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు ఎంఎస్ రాజు.

వెంకటగిరి స్థానాన్ని కుమార్తె నుంచి తండ్రి కురుగొండ రామకృష్ణకు మార్చారు చంద్రబాబు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు పెండింగులో పెట్టే అవకాశం ఉంది. అనపర్తి వ్యవహరంపై క్లారిటీ వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అనపర్తి టీడీపీ టిక్కెట్ ఆశించిన నల్లమిల్లి రామకష్ణా రెడ్డి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news