పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలి – అంబటి రాంబాబు

-

టిడిపి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టును టిడిపి సర్వనాశనం చేసిందని ఆరోపించారు. పోలవరంపై మాట్లాడేందుకు టిడిపి నేతలకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి. పోలవరం పురోగతి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తున్నామని.. సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు ప్రచారానికే పరిమితమయ్యారని అన్నారు.

సీఎం జగన్ చొరవతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత తీరిందని అన్నారు. రూ. 12, 911 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. అదనంగా మరో 5 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని.. జగన్ కృషివల్లే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. చంద్రబాబు, దేవినేని ఉమా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news