గన్నవరం వైసీపీలో గ్రూప్ వార్ : ఉద్రిక్తత !

-

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో గ్రూప్ వార్ కలలకం రేపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోకున్నా వైసీపీ నేతలానే మారిపోయారు. తాజాగా ఆయనకు, వైసీపీ సీనియర్ నేత దుట్టాకు మధ్య కోల్డ్ వార్ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన చిన్న ఆవుటపల్లి మాజీ సర్పంచి, వైసీపీ నాయకులు కోట వినయ్ తదితర వైసీపీ కార్యకర్తల పై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఈమేరకు ఆత్కురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. బాధితులకు అండగా కెడిసిసి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు స్టేషన్ కు వచ్చారు. దీంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆత్కూరు పోలీసును యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ఇక ఆయన ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్న సంగతి తెలుసుకుని అనుచరులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news