అవినాష్ రెడ్డి పారిపోతే సిబిఐ చూసుకుంటుంది – స్పీకర్‌ తమ్మినేని

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విషయం అడగ్గానే మీడియాపై సీరియస్ అయ్యారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అవినాష్ రెడ్డి పారిపోతే సిబిఐ చూసుకుంటుంది నీకు నాకు పనేంటి ప్రతిపక్షానికి పూట గడవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతుందని వెల్లడించారు. అవినాష్ రెడ్డి పాత్ర ఉంటే సిబిఐ తెలుస్తుంది నీకు చెప్పాలా నువ్వేం సిబిఐ చీఫ్ అంటూ మీడియా పై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని.

అసెంబ్లీలో ప్రతిపక్షం నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి గోల చేస్తుందన్నారు. నేను సభ్యుల విధి విధానాలు చెపితే తప్ప వారి బాధ్యతలు తెలియదా ప్రభుత్వం తప్పులుంటే అసెంబ్లీకి రండి ప్రజా సమస్యలపై చర్చించండని తెలిపారు. లోకేష్ కరెక్ట్ గా మాట్లాడటమే రాదు నిన్న కూడా మీ ఉత్సహం చూస్తుంటే 2019 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు కరెక్ట్ అదే నిజమవుతుందని పేర్కొన్నారు. గడపగడపకు వెళ్తున్న వ్యక్తిగా చెబుతున్న మళ్లీ 2024 లో పూర్తి మెజార్టీతో 175 స్థానాలు గెలిచి ప్రభుత్వం ప్రారంభిస్తామని వెల్లడి్ంచారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

Read more RELATED
Recommended to you

Latest news