కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న కూటమి ఏడాది పాలన సందర్భంగా సభ కోసం భారీ ప్లాన్ చేశారు. అమరావతిలో ప్రధాని సభ జరిగిన ప్రాంతంలోనే నిర్వహించే యోచనలో ఉంది కూటమి సర్కార్.

సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఈ సభ నేపథ్యంలో వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు. వచ్చే నాలుగేళ్ల పాలన కాలానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు.