AP : కాపురానికి రావడం లేదని… భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త

-

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు భర్త. వీరులపాడు గ్రామంలో బంకా మేరీ ( 31) ను అతి దారుణంగా కత్తి తో పీక కోసి హత్య చేశాడు భర్త సుందర్రావు.

ఈ తరుణంలోనే.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెంది బంకా మేరీ ( 31). ఇక సంఘటన స్థలం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు వీరులపాడు పోలీసులు. భార్య కాపురానికి రాక పోవటంతో ఆగ్రహంతో అత్తింటికి వెళ్లి హత్య చేశాడు సుందరరావు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news