విద్యార్థులకు బిగ్‌ అలర్ఠ్.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ఠ్.. ఏపీలో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో సెలవులు ముగియగా…. రేపు, ఎల్లుండి కూడా ప్రభుత్వం హాలిడే ఇచ్చింది.

the-state-government-has-given-good-news-to-students-in-ap

ఈ నెల 21న ఆదివారం సెలవు కూడా కలిసి రావడంతో మొత్తంగా స్కూళ్లకు మూడు రోజులు హాలిడేస్ రానున్నాయి. ఈ అధనపు సెలవులకు బదులుగా రెగ్యులర్ గా వచ్చే సెలవుల్లో రెండు రోజులు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుంది.

కాగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు వడ్డీ రీయంబర్స్మెంట్ డబ్బులను సీఎం జగన్ నేడు ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకులు 9 నుంచి 11% వడ్డీతో రుణాలు అందిస్తుండగా…. రీయంబర్స్ చేయనుంది. 12 లక్షలమంది అర్హులుగా తేలగా…. తొలి దఫాలో 4,07,323 మంది ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం రూ. 46.90 కోట్లు విడుదల చేయనున్నారు. ఇలా ఏటా 2 విడతలుగా ప్రభుత్వం సాయం అందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version