తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్ లో చోరీ.. 2 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ

-

కలియుగ వైకుంఠం తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఆలయం పై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది. కౌంటర్ బాయి నిద్రిస్తుండగా రెండు లక్షల పైగా నగదును దోచుకెళ్లాడు ఓ దుండగుడు.

శనివారం రాత్రి 36వ కౌంటర్ నెంబర్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు గతంలో చోరీలు చేసినట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news