టీడీపీలో పేలబోతోన్న పెద్ద బాంబు ఇదే… బాలయ్య నిర్ణయం కీలకం!

-

చంద్రబాబు అనుమతి తీసుకున్నారా.. లేక ఈ విషయంలో తన నిర్ణయం తనదే అని కాస్త మారిన మనిషిగా ముందుకువెళ్లారా అనేది తెలియదు కానీ… హిందూపురం నియోజకవర్గం గురించి జగన్ కు లేఖరాయడంపై… బాలయ్యకు ప్రశంసలు వస్తున్నాయి! ఇంతకాలం బావచాటు బావమరిదిగా మాత్రమే మిగిలిపోయి “పెద్దాయన ఆత్మ”ను ఇబ్బందికి గురిచేస్తూవచ్చిన బాలయ్య… తాజాగా చేసిన పనితో టీడీపీలో ఒక వర్గానికి, అసంతృప్త నేతలకు ధైర్యం వచ్చిందని అంటున్నారు!

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో.. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసినవారు ప్రశాంతంగా నిద్రపోయి చాలారోజులే అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏసీబీ ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో.. పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో అన్న టెన్షన్ లో వారున్నరన్నా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో వారికి పూర్తి అండగా ఉండి, పూర్తి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా చంద్రబాబుదే! కానీ ఈ విషయంలో కూడా బాబు యూస్ అండ్ త్రో పద్దతిని ఫాలో అవుతున్నారా లేక ఇక వారితో అవసరం రాకపోవచ్చని లైట్ తీసుకున్నారా అనేది అర్ధం కావడం లేదంటున్నారు కొందరు సీనియర్లు!

తాజా అరెస్టుల విషయంలో “కారణాలు ఏవైనా” కానీ… కేవలం అచ్చెన్నాయుడు విషయంలో మాత్రమే బాబు సపోర్టుగా ఉంటున్నారని… మిగిలిన వారి విషయంలో లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, చింతమనేని, కొల్లు రవీంద్ర, జేసీ దివాకర్ రెడ్డి, అఖిల ప్రియ మొదలైన నేతల నుంచి వస్తోన్న ఆరోపణలు ఇవే! ఇంతకాలం పార్టీకోసం ఎంతో చేశామని, మరెంతో నష్టపోయామని… ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ తమను ఆదుకునే చర్యలకు ఉపక్రమించడం లేదని ఫీలవుతున్నారంట.

ఈ సమయంలో బాబు కాకుండా మరెవరైనా బలమైన వ్యక్తి తమకు తోడుంటే… సొంతకుంపటి పెట్టే ఆలోచనలో భాగంగా… టీడీపీలో చీలిక తెచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో తాజాగా కాస్త వాయిస్ & యాటిట్యూడ్ పెంచిన బాలయ్య వైపే వీరంతా మొగ్గుచూపుతున్నారని… బాలయ్య ఇప్పటికైనా కాస్త ధైర్యం చేసి ఒకడుగు ముందుకువేస్తే బాగుంటుందని వీరంతా భావిస్తున్నారంట!! ఇదే జరిగితే మళ్లీ టీడీపీ నందమూరివారి చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. ఫలితంగా “పెద్దాయన ఆత్మ” ఆనందిస్తుందని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news