జనసేన ఐదుగురు అభ్యర్థులు వీరే..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడుత అభ్యర్థులను ప్రకటించారు. తొలుత కేవలం ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. అయితే అందులో ప్రస్తుతానకి ఐదు స్థానాల అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేసింది. వీరిలో  తెనాలి- నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కోణతాల రామకృష్ణ, రాజానగరం-బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీలను ప్రకటించారు. 

మిగిలిన 19 మంది అభ్యర్థులను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ అరాచక పాలనను గద్దె దించేందుకు తాము సిద్ధం అయ్యాయని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తు పెట్టుకున్నట్టు మరోసారి చెప్పుకొచ్చారు. తాము అసెంబ్లీతో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. మిగిలిన చోట్ల గెలుపు గుర్రాలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news