ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇదే..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్-డీఎస్సీ) మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీషు భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు.

ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్న అధికారులు.. 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ ఇదే. వీటిని అభ్యర్థులు గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news