సీఎం జగన్ పై దాడి చేసింది రాయితో కాదు…ఆ గన్ తోనే !

-

సీఎం జగన్ పై జరిగిన దాడి పై స్పందించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సీఎం జగన్ పై రాయితో దాడి జరగలేదని.. సీఎం జగన్ పై ఎయిర్ గన్ తో దాడి చేసినట్లు తెలుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎయిర్ గన్ కు సంబంధించిన పెల్లెట్ వచ్చి జగన్ కంటి పైన తగిలినట్లు తెలుస్తోందన్నారు.

దాడి చేయాలనుకున్న వారు ఎయిర్ గన్ తో సీఎం జగన్ నుదుటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోందని వివరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీఎం జగన్ కు భద్రత తగ్గించారని ఆగ్రహించారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news