BREAKING : పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి లారీ-కారు-టాటా ఏస్‌ వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను తేజ (20), రాంబాబు (40), మధు (25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు కొద్ది సమయంలో ఇంటికి చేరతారనగా రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : సిమెంటు, కంకర కలిపే మిల్లర్‌ను ఐషర్‌ వాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసుకెళ్తోంది. పెదకాకాని అమెరికన్‌ ఆంకాలజీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎదుట ఉన్న జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి మరమ్మతులకు గురై రోడ్డు కుడివైపు నిలిచిపోయింది. ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్‌ని బలంగా ఢీకొట్టింది. మిల్లర్‌ రోడ్డు మధ్యలోకి జరిగింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొంది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు(40), గుంటూరు నగరానికి చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news