హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..బయట అడుగు పెట్టకండి !

-

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..బయట అడుగు పెట్టకండి అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ వరకు విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయట నైరుతి రుతుపవనాలు. దీంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

40-50 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అటు హైదరాబాద్ కు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం ఉంది. సిటీకి భారీ వర్ష సూచనతో GHMC, సంబంధిత అధికారులను అలెర్ట్ చేసింది ఐఎండీ. అవసరమైతేనే బయటకు రావాలని హైదరాబాద్ నగరవాసులకు ఐఎండీ సూచనలు చేసింది. ఇప్పటికే పలు జిల్లాలలో ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news