Cm Jagan: సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌..ఎప్పుడంటే ?

-

Cm Jagan: సీఎం జగన్‌ నామివేషన్‌ దాఖలుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 22 న సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10.30 గంటల కు నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు ఈ నెల 21 న కుటుంబంతో కలిసి పులివెందుల కు రానున్నారు.

Time fixed for CM Jagan’s nomination filing

నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచార భాద్యతలు చేపట్టనున్నారు సీఎం సతీమణి వైఎస్ భారతి. ఎన్నికల పూర్తి అయ్యే వరకు పులివెందులలో మకాం వేయనున్నారు వైఎస్ భారతి. పులివెందుల ప్రచార పర్వం మొత్తం వై ఎస్ భారతి సారధ్యం లో కొనసాగనుంది. ఈ తరుణంలోనే.. పులివెందులలోని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు వైఎస్‌ భారతి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news