ఇవాళ, రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర

-

ఇవాళ, రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ లో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు సీఎం జగన్.

CM Jagan’s bus trip from 27th of this month

రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం చేస్తారు జగన్. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంటుంది. ఇవాళ రాత్రి గూడూరు మండలం నాగులాపురంలో సీఎం జగన్ బస చేస్తారు. తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 131 కి.మీ కొనసాగనుంది సీఎం జగన్ బస్సుయాత్ర.

Read more RELATED
Recommended to you

Latest news