నేడు పిఠాపురం లో నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్

-

ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగనున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల హడావిడీ ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి తరుణంలో.. అందరి చూపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పైనే ఉంది. కాకినాడలోని పిఠాపురం నుంచి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే నేడు పిఠాపురం లో నామినేషన్ వేయనున్నారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే గొల్లప్రోలు నుంచి పిఠాపురం కు ర్యాలీ తీయనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. అలాగే, శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేయనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఇక సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్‌. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news