KTR: సర్వేల ప్రకారం BRSకు 8-10 సీట్లు

-

పార్లమెంట్ ఎన్నికలపై మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని తెలిపారు. తాజాగా జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసిన సర్వే లెక్కల ప్రకారం గులాబీ పార్టీకి కచ్చితంగా ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.

ప్రజా సమస్యలపై పోరాటడంతో పాటు కాంగ్రెస్ మరియు బిజెపి ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. సిరిసిల్లలో కార్యకర్తల తో ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇవాళ వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ సీటు ఎలా గెలవాలనే దానిపై కార్యకర్తలతో దిశా నిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news