హైదరాబాద్ నుంచి విజయవాడ రాకపోకలు బంద్..!

-

బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పటి వరకు 13, 227 మంది పునరావాస శిబిరాలకు తరలించింది ప్రభుత్వం. వర్షాలు.. వరదల కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు.

భారీ వర్షాల కారణంగా రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ రాకపోకలు బంద్ అయ్యాయి. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై చేరింది వరద నీరు. మున్నేరు వరద ఉదృతితో హైవే పై వరద నీరు చేరింది.  జాతీయ రహదారి పై వరద చేరటంతో రాకపోకలు నిలిపి వేసారు నందిగామ పోలీసులు. నిన్న కూడా జాతీయ రహదారి పై వరద చేరడంతో రాకపోకలు బంద్ చేశారు. వరద తగ్గిన తరువాతనే మళ్లీ వాహనాలు రాకపోకలు సాగాయి. తాజాగా మళ్లీ వరద ఎక్కువవ్వడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news