TTD : తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుమల దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు టైం స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా.. 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. ఇదిలాఉండగా, గురువారం తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు సందర్శించినట్లు సమాచారం. అదేవిధంగా 22,942 మంది తలనీలాలు సమర్పించారు.

ఇక శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు కొండకు తరలివస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కాలినడకన వచ్చే భక్తుల కోసం సర్వదర్శనం టోకెట్లను సరిపడా అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news