భక్తులకి టీటీడీ గుడ్ న్యూస్.. త్వరలోనే దర్శనాల పెంపు ?

-

భక్తులకు శుభవార్త చెప్పేందుకుసిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపధ్యంలో రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవ సేవలు పున ప్రారంభం కానున్నాయి. అలానే దర్శనం టిక్కెట్లు పెంపు విషయం మీద రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చిన తర్వాత క్రమంగా దర్శనాలు సంఖ్య కూడా పెరుగుతోంది.

జూన్ 8న ప్రయోగాత్మకంగా 6000 మంది భక్తులతో దర్శనాలు ప్రారంభించారు. అప్పటి నుండి గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతి ఇస్తోంది టిటిడి. ప్రస్తుతం రోజుకు 18 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తోంది. ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కల్పిస్తోంది. అంచెల వారీగా దర్శనం టిక్కెట్లు సంఖ్యను కూడా పెంచుతూ పోతోంది. ప్రస్తుతం కూడా మూడు వేల మందికి దర్శనం టిక్కెట్లు పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం మీద జవహర్ రెడ్డి స్పందిస్తూ మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news