శ్రీకాకుళంలో విషాదం…ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి

-

శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు ( మం ) అనకాపల్లి లో ఎలుగు బంటి భీభత్సం సృష్టించింది. ఈ ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో మహిళ కు గాయాలు అయ్యాయి.

Two killed in bear attack

మృతులు అప్పికొండ కూర్మారావు (45 ) సిడి పల్లి లోకనాధం (46) గా గుర్తించారు అధికారులు. జీడి తోటలో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల పై దాడి చేసి చంపేసింది ఎలుగుబంటి. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు. అలాగే…అటవీశాఖ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news