Ugadi Pnachangam: ఏపీలో ఆ పార్టీకి 128 ఎమ్మెల్యే, 24 ఎంపీ సీట్లు !

-

టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగాది పచ్చడి అందించారు వేద పండితులు. అనంతరం పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రావణం వినిపించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరిగింది.

Ugadi Pnachangam 128 MLA and 24 MP seats for that party in AP

పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని.. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్నారు. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతోందని వెల్లడించారు.

బ్రహ్మ – మోడీ, విష్ణువు – పవన్, ఈశ్వరుడు – చంద్రబాబు అని… 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలుస్తారని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ వెల్లడించారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారన్నారు మాచిరాజు వేణుగోపాల్. టీడీపీది వృశ్చిక రాశి…. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news