వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలి – వర్ల రామయ్య

-

వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వైసీపీ దళిత మంత్రులు జగన్ మోచేతి నీరు తాగుతున్నారు… వైసీపీ దళిత మంత్రులు బిస్కెట్ బ్యాచ్ అంటూ నిప్పులు చెరిగారు. కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వైసీపీలో దళితులకు బిస్కెట్లు వేస్తారు…వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

varlaramaiah questions ys jagan on viveka murder case

విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టినప్పుడే వైసీపీలో దళితులు ఫినిష్ అయింది…మంత్రిగా ఉండి చొక్కా విప్పి గంజాయి తాగిన వాడిలా సురేష్ వ్యవహరించారన్నారు. మంత్రి సురేష్ ఓ యూజ్ లెస్ ఫేలో అని.. ఐఆర్ఎస్ చేసిన సురేష్ బఫూన్ మాదిరి వ్యవహరించారని మండిపడ్డారు. సజ్జల చెబితే చొక్కా విప్పడానికి సురేషుకైనా సిగ్గుండాలిగా..? డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి మతి స్థిమితం లేదని విమర్శలు చేశారు. నారాయణ స్వామికి సిగ్గు ఎగ్గు లేదు…రెడ్లందరూ కూర్చొంటే దూరంగా చేతులు కట్టుకుని నిల్చొంటారా..? అని నిలదీశారు.జగన్ ఎంత మంది దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చారో మంత్రి మేరుగ సమాధానం చెప్పగలరా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news