బోండాల దుకాణానికి పెట్టుకోరా..బోండా ఉమా – విజయసాయిరెడ్డి

-

బోండాల దుకాణానికి పెట్టుకోరా అంటూ బోండా ఉమాపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఎప్పుడూ టీడీపీ పార్టీని విమర్శించే వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. తాజాగా బోండా ఉమాపై విరుచుకుపడ్డారు. బెజవాడ ప్రజలు బండకేసి బాదినా తీరు మారలేదు అసెంబ్లీ బూతు బోండాం గాడికి. దున్నపోతులాంటి కొడుకును రోడ్డు మీదకు వదలి పాదచారుల ప్రాణాలు తీస్తే…పోలీసుల బూట్లునాకిన రోజుల్ని మర్చిపోయావారా బోండాం? అని ఫైర్‌ అయ్యారు విజయసాయిరెడ్డి.

వచ్చే ఎన్నికల తర్వాత నీ ఇంటి ముందు బోండాల దుకాణానికి దరఖాస్తు పెట్టుకోరా ఇడియట్ అంటూ చురకలు అంటించారు. ఇక మరో ట్వీట్‌ లో.. 20 డిస్టిలరీల్లో గజదొంగ బొల్లి సెంద్రం నాయుడు హయాంలో 14 డిస్టిలరీలకు 1400 కోట్లు లంచం పుచ్చుకొని ‘చంద్రం కానుక’గా 2016-18లో గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, లెజెండ్ లాంటి 115 చీప్ లిక్కర్ బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చి 40 వేల బెల్టు షాపులు నడిపించిన రాక్షస చరిత్ర కంపు సెంద్రానిదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news