ఇంద్రకీలాద్రి అమ్మవారి రెండవ రోజు హుండీ లెక్కింపు..!

-

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీ లెక్కింపు రెండవ రోజు పూర్తి అయ్యింది. ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు ప్రకారం.. 2,76,68,347 రూపాయలు నగదు రూపంలో వచ్చాయి. ఇక కానుకల రూపములో బంగారం 140 గ్రాములు.. వెండి 6 కేజీల 498 గ్రాములు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇక విదేశీ కరెన్సీ చూస్తే.. USA – 70 డాలర్లు, యూరప్ – 5 యూరోస్, ఒమాన్ – 1 రియాళ్, 800 బైసా, ఇంగ్లాండ్ – 15 పౌండ్లు, ఫిజీ – 20 డాలర్లు, సౌదీ – 1 రియాల్, ఇంగ్లాండ్ – 15 పౌండ్లు వచ్చాయి.

ఇక ఈరోజు హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె ఎస్ రామరావు , డీప్యూటీ ఈవో రత్న రాజు , దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news