కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన శని : కాసం వెంకటేశ్వర్లు

-

కేటీఆర్ అధికారం కోసమే తెలంగాణకు వచ్చారు. కేటీఆర్ మూలాలంత అమెరికాలో ఉన్నాయి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం ఇచ్చింది, ఏం చేసిందో ప్రజలకు తెలుసు. తెలంగాణ అభివృద్ధిపై నాడు సవాల్ విసిరినప్పుడు తొక ముడిచిన కేటీఆర్ నేడు ఎగిరిపడుతున్నాడు. కుటుంబ పార్టీలకు బీజేపీ ప్రమాదకరం. అందుకే బీజేపీ అంటే కేటీఆర్ కు భయం. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. శని. కేటీఆర్ శివలింగం పై తేలు లాంటోడు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.

కల్వ కుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులు భయాందోళనలో ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండ నిరుద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అశోక్ నగర్ ను పోలీస్ వలయంగా మార్చారు దీన్ని బీజేపీ తీవ్రంగా కండిస్తోంది. నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోంది. పదేళ్లు కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిండా ముంచారు. గతంలో ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టిన బుద్ధి కేటీఆర్ ది. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించి, సమస్యను సాల్వ్ చేయడానికి ప్రభుత్వం విఫలం అవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే విధానాలు అవలంభిస్తున్నాయి అని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news