వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం యూటర్న్ తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చెయ్యడం లేదంటూ స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటించిన మరుసటిరోజే దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని, సంస్థను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది. ” రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ( ఆర్ఎన్ఎల్) డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదు. ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. దీన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news