వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ చేస్తా – బాలినేని

-

ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తాము పోటీ చేయడంపై రకరకాల మాటలు మాట్లాడుతున్నారని.. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అందరం కలిసి కష్టపడి పనిచేస్తామన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను స్లోగా ఉన్నానని సీఎం జగన్ అన్నారని వివరించారు. అయితే ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో ఆలస్యం అవుతుందని ముఖ్యమంత్రి కి వివరించానన్నారు. ఇతర వాళ్ళ లాగా హడావుడిగా, ఏదో మొక్కుబడిగా కాకుండా జనం సమస్యలను పరిష్కరించేలా ఒక్కో ఇంటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్లే ఆలస్యం అవుతుందని ముఖ్యమంత్రికి వివరించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news