ప్రియుడు ఫోన్ చెయ్యలేదని వివాహిత ఆత్మహత్య..!

-

ప్రియుడు తన మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అయితే విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ కు అలాగే తమిళనాడుకు చెందిన హుస్సేన్ తో పెళ్లి అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ గత ఆరు నెలలుగా భార్యా భర్తల మధ్య గొడవలు వస్తుండటంతో.. ముగ్గురు పిల్లలతో కలసి విజయపురం మండలంలోని తమ అమ్మ ఇంటికి వచ్చేసింది దిల్షాద్.

అయితే ఈ అయారు నెలల కాలంలో అశోక్ కుమార్ అనే యువకుడు దిల్షాద్ కు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమాగా మారడంతో పిచ్చటూరు మండల కేంద్రంలో ఓ ఇల్లు తీసుకొని ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. కానీ అశోక్ భార్యకు డెలివరీ టైం కావడంతో దిల్షాద్ ను వదిలేసి భార్య వద్దే ఉంటున్నాడు అశోక్ కుమార్. అందువల్ల నాలుగు రోజుల నుండి దిల్షాద్ అశోక్ కుమార్ మాట్లాడలేదు. అయితే అశోక్ తనతో మాట్లాడటం లేదని మనస్థాపానికి గురైన దిల్షాద్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక విషయం తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news