జగన్ హత్యా రాజకీయాలు చేసారు – వైఎస్‌ షర్మిల సంచలనం

-

మాజీ సీఎం జగన్ పై వైఎస్‌ షర్మిళ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఏది విత్తుతారో అదే కోస్తారు..జగన్ హత్యా రాజకీయాలు చేసారని మండిపడ్డారు. ఏదీ పట్టించుకోని జగన్… ఇప్పుడు మీ కార్యకర్తలు చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని నిలదీశారు. అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు మీరు… వినుకొండ మర్డర్ వ్యక్తిగత మర్డర్… పొలిటికల్ మర్డర్ కాదన్నారు. పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని… పవన్ కళ్యాణ్ కు ఇలాంటి హత్యలు జరుగుతుంటే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

 


పోలవరానికి డబ్బులు ఇచ్చేసాం అంటే.. ఇక ఇవ్వరనుకోవాలా.. చెప్పాలి…రాజధాని కట్టుకోవడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుంది.. రాజధాని మాటేంటి అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు అన్నారు నిన్న ఒక మంత్రి.. మరి కేప్టింగ్ మైన్స్ మాటేంటి…విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్నా భూములు అమ్ముకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. రైల్వే జోన్ కు భూములు విషయంలో బిజెపి, వైసీపీ టెన్నిస్ ఆడుకున్నాయని ఆగ్రహించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ లకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీల మాటేంటి ? ఏపీ విభజన హామీలు రావాలంటే 15లక్షల కోట్లు అని కాంగ్రెస్ అంటే‌.. చంద్రబాబు 5 లక్షల కోట్లు చాలని ఎలా అంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news