కేంద్రంలో చక్రం తిప్పే చంద్రబాబే.. ప్రత్యేక హోదా తీసుకురావాలి – షర్మిల

-

కేంద్రంలో చక్రం తిప్పే చంద్రబాబే.. ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిల. రైతులు ఎలా బ్రతకాలి.. వర్షాలు, వరదలు పిడుగులా పడ్డాయి..కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడన్నారు. రైతుల గురించి వారి పరిస్ధుతుల గురించి ఆలోచించాలి.. ఆదుకోవాలన్నారు. బిజెపితో జతకట్టిన చంద్రబాబు దీనిని మామూలు వర్షంగా చూడకుండా రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇస్తే రేవంత్ నిలబెట్టారన్నారు. బిజెపి కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ షరామామూలే.. ఈ సంవత్సరం ఏమైనా మార్పుంటుందా.. చంద్రబాబు చెప్పాలని ఫైర్‌ అయ్యారు.

ys sharmila on chandrababu palana

ఇక అటు మాజీ సీఎం జగన్ పై వైఎస్‌ షర్మిళ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఏది విత్తుతారో అదే కోస్తారు..జగన్ హత్యా రాజకీయాలు చేసారని మండిపడ్డారు. ఏదీ పట్టించుకోని జగన్… ఇప్పుడు మీ కార్యకర్తలు చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని నిలదీశారు. అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు మీరు… వినుకొండ మర్డర్ వ్యక్తిగత మర్డర్… పొలిటికల్ మర్డర్ కాదన్నారు. పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని… పవన్ కళ్యాణ్ కు ఇలాంటి హత్యలు జరుగుతుంటే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news