వైఎస్సార్ విగ్రహాలపై దాడులు..షర్మిల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

-

వైఎస్సార్ విగ్రహాలపై తెలుగు తమ్ముళ్లు దాడులు చేస్తున్న తరుణంలో వైఎస్‌ షర్మిల స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం అంటూ ఫైర్ అయ్యారు.

ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని వెల్లడించారు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం స్పష్టం చేశారు. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదన్నారు. వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని షర్మిల వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news