దారుణం: గెస్ట్‌ హౌస్‌కు రప్పించి మహిళా ఉద్యోగిపై గ్యాంగ్ రేప్!

-

పార్టీ పేరుతో గెస్ట్ హౌస్‌కు రప్పించి ఓ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ జిల్లాలోని విధాన్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బీపీఓ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ మహిళ(30)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఒక మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

మహిళ-అత్యాచారం
మహిళ-అత్యాచారం

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సీనియర్ సహచరులు ఇద్దరు పార్టీ పేరుతో గెస్ట్ హౌజ్‌కు పిలిచారన్నారు. మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన సమయంలో మహిళా కొలీగ్ కూడా ఉందని, ఆమె హస్తం కూడా ఉందన్నారు. ఈ మేరకు జూన్ 15వ తేదీన బగియాటి పోలీస్ స్టేషన్‌లో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు భాస్కర్ బెనర్జీ, ఇంద్రాణిదాస్, చరణ్‌జిబ్ సూత్రధార్‌లను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news