వైసీపీకి మరో బిగ్ షాక్…ఓటమి ఎఫెక్ట్ పార్టీకి కీలక నేత రాజీనామా

-

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని అధికారాన్ని కోల్పోయింది. అంతలోనే మళ్లీ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కొందరు నేతలు వైసిపి పార్టీకి గుడ్ బాయ్ చెప్పనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడవకుండానే ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది.

తాజాగా మరో సీనియర్ నేత గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. వైసిపి పార్టీ అధినేత జగన్ కు రిజైన్ చేసిన లెటర్ ను పంపించారు. బీజేపీ నుండి గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఆయనకు ఇవ్వలేదని తీవ్ర నిరాశకు గురై నా సాంబశివరావు బీజే పీ పార్టీకి గుడ్ బై చెప్పి అప్పటి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి ఘోరంగా ఓడిపోవడంతో సాంబశివరావు మళ్లీ బిజేపి పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news