ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు

-

వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో షాక్ తగిలింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన సంచలనాలకు వేదికగా మారుతున్నారు. మాట్లాడితే చాలు కేసు నమోదు అవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ ఇతర మతస్తులను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన రాజాసింగ్ పై గత రెండు రోజుల క్రితం కూడా ముంబైలో ఓ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. జనవరి 28వ తేదీన ముంబైలో రాజాసింగ్ సభలో విద్వేష ప్రసంగం చేసినందుకుగాను ఆయనపై కేసు నమోదు అయింది. ముంబైలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చి రెండు రోజులు కూడా గొడవకముందే మరో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news