ఇండస్ట్రీకి మరో వారసురాలు.. ఏకంగా పాన్ ఇండియా మూవీ తో.. సక్సెస్ అయ్యేనా..?

-

సినీ ఇండస్ట్రీలోకి సెలబ్రిటీల వారసులకు కొదవలేదనే చెప్పాలి. ఇకపోతే ఎన్టీఆర్ మొదలుపెట్టిన ఈ పద్ధతి నేటికీ ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్ లుగా కొనసాగిన వారు ఇప్పుడు వారి తరం ముగిసిన తర్వాత తమ వారసులను ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరొక వారసురాలు సినీ ఇండస్ట్రీలోకి పాన్ ఇండియా మూవీ ద్వారా అడుగు పెట్టబోతోంది. ఇక మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో రేంజ్ దక్కించుకుందంటే.. ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వారెవరో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం ప్రముఖ దివంగత నిర్మాత రాము, సీనియర్ హీరోయిన్ మాలశ్రీ ల కుమార్తె రాధనా రామ్ కన్నడలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు.

దర్శన్ 56 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాతో ఈమె హీరోయిన్గా పరిచయం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఆశ్రమంలో శుక్రవారం రోజు వర మహాలక్ష్మి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తన రాక్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను కన్నడ రాబర్ట్ సినిమా దర్శకుడు తరుణ్ సుధీర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మాల శ్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.ఈ మధ్యకాలంలోనే తన భర్త .. నిర్మాత రాము మరణించారు. మరి పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ అవుతుందో లేదో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news