నిరుద్యోగులకు శుభవార్త..తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో నోటిఫికేషన్

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం.  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే, నిరుద్యోగులకు మరో తీపి కబురును తెలంగాణ ప్రభుత్వం అందించింది.

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని మొత్తం 19 సబ్జెక్టులలో 247 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాల నియామకాల కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఉండనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news