రుయా ఘటనపై మరో పిటీషన్… సర్కార్ కు ఇబ్బందే…?

-

తిరుపతి రుయా ఆస్పత్రిపై ఘటనపై హైకోర్ట్ లో మరో పిటిషన్ దాఖలు అయింది. టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదనలు వినిపించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారు. ఇది నిర్లక్ష్యమేనని వాదనలు వినిపించారు.

ap high court

బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోంది అని వివరించారు. న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన ఐదు ప్లాంట్లను నేటివరకు నెలకొల్పలేదు అని విమర్శించారు. వాదనలు విని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు ఇచ్చింది కోరతగ్. వేసవి సెలవుల అనంతరం కోర్ట్ ప్రారంభమైన తొలిరోజుకి విచారణ వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news