ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం.. చార్జ్ షీట్ లో వైసీపీ ఎంపీ, సీఎం పేర్లు

-

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో ఛార్జ్ షీట్ ను ఫైల్ చేశారు అధికారులు. ఈ రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ బాగుంటది పేరును కూడా మరోసారి చేర్చారు. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు నే ప్రస్తావించడంతో ఈ స్కాం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.

కాగా 428 పేజీలతో కూడిన రెండవ చార్జి షీట్ ను ఈడి రిలీజ్ చేసింది. క్యాంప్ ఆఫీస్ లోనే ఈ తతంగం అంతా నడిచిందని పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి తో పాటు మరో 17 మంది నిందితులపై ఈడి అభియోగాలు మోపింది. ఈ ఛార్జ్ షీట్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడి అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం లేదని, కేవలం ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రమే పనిచేస్తుందని ఆరోపించారు. ఈడి చార్జిషీట్ ఒక కల్పితం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news