ఐపీఎల్: నైట్ రైడర్స్ పై భారీ తేడాతో గెలిచిన కోహ్లీ సేన..

-

ఐపీఎల్ లో ఈ రోజు రెండు మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో 38పరుగుల తేడాతో బెంగళూరు విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు 20ఓవర్లు ముగిసేసరికి, 4వికెట్లు కోల్పోయి 204పరుగులు చేయగలిగింది. మాక్స్ వెల్, డివిలియర్స్ అర్థ సెంచరీలు చేయడంతో బెంగళూరు స్కోరు రెండు వందలు దాటింది. 205పరుగులు సెట్ చేసిన బెంగళూరుపై పై చేయి సాధించడానికి బరిలోకి దిగిన నైట్ రైడర్స్ జట్టు 20ఓవర్లు ముగిసేలోగా 8వికెట్లు నష్టపోయి 166పరుగులు మాత్రమే చేసి, బెంగళూరుకి ఘన విజయాన్ని అందించింది.

స్కోరు విషయానికి వస్తే, బెంగళూరు బ్యాట్స్ మెన్లలో మ్యాక్స్ వెల్ 78పరుగులు (49బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు), డివిలియర్స్ 76పరుగులు (34బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు), దేవ్ దత్ పడిక్కల్ 25పరుగులు (28బంతుల్లో 2ఫోర్లు) చేసారు. నైట్ రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2వికెట్లు, పాట్ కమిన్స్, ప్రసీద్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్లలో ఆండ్రూ రస్సెల్ 31పరుగులు (20బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ 29పరుగులు (23బంతుల్లో 1ఫోర్, 21సిక్సర్లు) షకిబ్ అల్ హసన్ 26పరుగులు (26బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్) చేసారు. బెంగళూరు బౌలర్లలో కైల్ జామిసన్ 3వికెట్లు, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు, వాషింగ్టన్ 1వికెట్ తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news