అ.. ఆ లు రాస్తున్న అనుపమ పరమేశ్వరన్..

-

నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతొ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్, ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ.. ఆ, రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు ఆమెకి మంచి హిట్లుగా నిలిచాయి. తెలుగులో చాలా సినిమాల్లో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ మళయాలీ అమ్మాయి.

తెలుగు బాగానే మాట్లాడుతుంది కానీ రాయడం మాత్రం రాదు. ఐతే తాజాగా అనుపమ్ పరమేశ్వరన్ తెలుగు రాయడం నేర్చుకుంటుంది. అ.. ఆ..లు నేర్చుకుంటూ తెలుగు రాయడం మొదలెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి, కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే మొదలెట్టానని, థ్యాంక్స్ గోపీ గారంటూ పోస్ట్ పెట్టింది. తెలుగు వచ్చిన చాలా మంది హీరోయిన్లు, ప్రమోషన్ టైమ్ లో ఇంగ్లీషులో మాట్లాడుతూ, బడాయికి పోతూ, ప్రేక్షకులకి దూరమవుతుంటే, అనుపమ్ పరమేశ్వరన్ తెలుగు రాయడం నేర్చుకుంటూ తెలుగు వారికి మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news