అన్ని కోట్లు ఖర్చుపెట్టి కొత్త ఫామ్ హౌస్ కొన్న అనుష్క విరాట్..!!

-

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలాకాలం ప్రేమించుకుని వీరిద్దరూ 2017న వివాహం చేసుకున్నారు. ఇక వివాహ పెద్దలంగీకారంతోపాటు బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్నప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఇక తనకు కూతురు జన్మించిన తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమైంది. కేవలం కుటుంబనికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నది.

ఇక అంతే కాకుండా పలు నిర్మాణ సంస్థలను కూడా ఆపివేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా వీరిద్దరూ కలిసి తాజాగా ఒక కొత్త ఫామ్ హౌస్ ని కొనుగోలు చేసినట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక గతంలో కూడా రణబీర్, దీపిక ఇద్దరు కూడా ఒక కొత్త ప్లాటును కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అనుష్క , విరాట్ కోహ్లీ జంట కూడా ఇటీవల ముంబైలో ఆలీబాబా ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఒక ఫామ్ హౌస్ ని తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫామ్ హౌస్ ఎనిమిది ఎకరాల స్థలంలో ఉన్నట్లు తెలుస్తుంది.Virat Kohli, Anushka Sharma buy 8-acre land in Alibaug; check price and other details - BusinessToday

బాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అనుష్క , విరాట్ దంపతులు ఈ ఫామ్ హౌస్ ను తీసుకోవడానికి దాదాపుగా 20 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక విరాట్ తమ్ముడు అయిన వికాస్ కోహ్లీ.. రూ.1.15 కోట్ల రూపాయలు డిపాజిట్ ను ప్రభుత్వానికి చెల్లించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్లతో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆసియా కప్ లో టీమిండియా తరఫున ఆడుతూ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news