ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై చర్చ

-

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ సమావేశం కానుంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదం తెలుపనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డ్రోన్ సర్వే, ఫిబ్రవరి డు లబ్ధిదారులకు అందాల్సిన పట్టాల పంపిణీ వంటి అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్ లో అధిక కేటాయింపులు ఉండొచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే అమ్మ ఒడి, నాడు నేడు, విద్యా దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నందున విద్యారంగానికి బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news