BREAKING : ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం.. ఏపీ ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం జరిగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటల తర్వాత ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

గ్రామ మరియు వార్డు సచివాలయాల చట్టబద్ధతపై అధికారిక ప్రకటన చేయనుంది ఏపీ కేబినెట్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే పోలవరం పై నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం విరుద్ధంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ప్రకటనపై.. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇవాల్టి సమావేశంలో కీలక చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో దీని పై ఎలా సమాధానం ఇవ్వాలని దానిపై కూడా జగన్ చర్చించనున్నారు. కాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత  మంత్రులతో ప్రత్యేకంగా సీఎం జగన్ సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news